కర్నూలు: ఆంధ్రప్రదేశ్లోని కర్నూల్ జిల్లా నంద్యాల చెక్పోస్ట్ వద్ద మంగళవారం భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ హోటల్లో మూడు గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకున్నది. సిలిండర్లు పేలడంతో భారీ శబ్దాలతో మంటలు ఎగిసిపడుతున్నాయి. నంద్యాల చెక్పోస్ట్ సర్కిల్ పక్కనే ఉన్న గుడిసెలు దగ్ధం అవుతున్నాయి.
ఈ మంటలు చుట్టుపక్కల ఉన్న హోటల్స్, షాప్లకు కూడా వ్యాపిస్తున్నాయి. ప్రమాదంపై స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సమాచారం అందగానే పోలీసు, అగ్ని మాపక దళ సిబ్బంది అక్కడికి చేరుకున్నారు.
ఈ ప్రమాదం వల్ల నంద్యాల, నందికొట్కూర్ మార్గంలో భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు ట్రాఫిక్ను నియంత్రించడంతోపాటు సహాయ చర్యలు చేపడుతున్నారు. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
రన్నింగ్ బస్సులోంచి వాంతులు.. లారీ ఢీకొట్టడంతో తెగిపోయిన బాలిక తల..!
మోదీ సభకు వెళ్తుండగా ప్రమాదం.. తమిళనాడు స్పీకర్కు గాయాలు
పున్నమి చంద్రుడే ఆ నౌకను కదిలించాడు.. !