తిరుపతి : టీటీడీ ఆధ్వర్యంలోని శ్రీ వేంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్పశిక్షణ సంస్థలో ఫిబ్రవరి 26 నుంచి మార్చి 3వ తేదీ వరకు ఆరు రోజుల పాటు శిల్పాల ప్రదర్శన, అమ్మకం నిర్వహిస్తున్నామని టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి అలిపిరి రోడ్డులోని బాలాజీ లింక్ బస్టాండ్ పక్కనగల శిల్ప కళాశాలలో శనివారం ఉదయం 11 గంటలకు ఈ ప్రదర్శన ప్రారంభం అవుతుందన్నారు.
శిల్పకళాశాల విద్యార్థులు రూపొందించిన దేవాలయ విమానాలు, మండపాలు, గోపురాలు, శిలాశిల్పాలు, సుధాశిల్పాలు, దారుశిల్పాలు, పంచలోహ శిల్పాలు, సంప్రదాయ వర్ణచిత్రాలు, సంప్రదాయ కలంకారి వర్ణచిత్రాలను ప్రదర్శించడం తోపాటు విక్రయిస్తారని వెల్లడించారు. . ప్రతిరోజూ ఉదయం 10 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు.