Vizag | హైదరాబాద్, సెప్టెంబర్ 20 (నమస్తే తెలంగాణ): ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తన మంత్రివర్గ సహచరులకు స్పష్టం చేశారు. బుధవారం ఆయన అధ్యక్షతన అమరావతిలోని వెలగపూడి సచివాలయంలో ఏపీ క్యాబినెట్ సమావేశం జరిగింది. ఈ భేటీలో పలు నిర్ణయాలు తీసుకున్నారు.
అనంతరం మంత్రులతో జగన్ మాట్లాడుతూ అసెంబ్లీ, జమిలి ఎన్నికల గురించి ప్రస్తావించారు. జమిలి ఎన్నికలపై స్పష్టత రావాల్సి ఉన్నదని, ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలిపారు. దసరా నుంచి విశాఖపట్నం కేంద్రం గా పాలన నిర్వహించాలని, సివిల్ సర్వీసులకు ఎంపికైన ఏపీ అభ్యర్థులకు ప్రోత్సాహాకాలు ఇవ్వాలని క్యాబినెట్ నిర్ణయించింది.