అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈద్ మిలాదున్ నబీ పర్వదినం సందర్భంగా ఈ నెల 19వ తేదీన సెలవు ప్రకటించింది. అయితే ముందుగా ప్రకటించిన క్యాలెండర్లో 20వ తేదీన సెలవు ఇచ్చారు. ఈ మేరకు ప్రభుత్వం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.
కానీ ఇస్లామిక్ క్యాలెండర్లో మూడో నెల అయిన రబీ అల్-అవ్వాల్ నెలలో ఈ పండుగను జరుపుకుంటారు. రబీ ఆల్ అవ్వాల్ నెలలో 12వ రోజు మూన్ కనిపిస్తుండటంతో.. మంగళవారం సెలవు ప్రకటించారు. మహ్మద్ ప్రవక్త పుట్టిన రోజు సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ ఈద్ మిలాదున్ నబీ పండుగను ముస్లింలు జరుపుకుంటారు.