తిరుపతి: ఆంధ్రప్రదేశ్లో స్వల్పంగా భూమి కంపించింది. ఆదివారం తెల్లవారుజామున 1.10 గంటల సమయంలో తిరుపతిలో భూకంపం వచ్చింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 3.6గా నమోదయిందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) తెలిపింది. భూకంప కేంద్రం తిరుపతికి 85 కిలోమీటర్ల దూరంలో ఉన్నదని వెల్లడించింది. భూ అంతర్భాగంలో 20 కిలోమీటర్ల లోతులు ప్రకంపణలు సంభవించాయని పేర్కొన్నది. కాగా, అర్ధరాత్రివేళ భూకంపం రావడంతో జనాలు ఇండ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు.
Earthquake of Magnitude:3.6, Occurred on 03-04-2022, 01:10:29 IST, Lat: 14.24 & Long: 79.90, Depth: 20 Km ,Location: 85km NE of Tirupati, Andhra Pradesh, India for more information Download the BhooKamp App https://t.co/QSzi22cneF @ndmaindia @Indiametdept pic.twitter.com/P9RcXBkWi6
— National Center for Seismology (@NCS_Earthquake) April 2, 2022