విధిగా వ్యాక్సిన్ తీసుకోండి: కలెక్టర్ హనుమంతరావు
సంగారెడ్డి కలెక్టరేట్, ఏప్రిల్ 6: జిల్లాలో 45 సంవత్సరాలు దాటిన వారందరూ వ్యాక్సిన్ తీసుకోవాలని కలెక్టర్ ఎం హనుమంతరావు స్పష్టం చేశారు. ఈ మేరకు కలెక్టర్ మంగళవారం ఒక ప్రకటన జారీ చేశారు. మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే చర్యలు తప్పవని హెచ్చరించారు. గత కొన్ని రోజులుగా కరోనా తీవ్రత దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రజలు తప్పనిసరిగా మాస్కు ధరించాలని, భౌతిక దూరం పాటించాలని సూచించారు. ఎవరైనా మాస్క్ ధరించకుండా బహిరంగ ప్రదేశాల్లో తిరిగితే వారిపై విపత్తు నిర్వహణ చట్టంలోని 51 నుంచి 60 సెక్షన్ల కింద ఇండియన్ పీనల్ కోడ్ 188 మేరకు చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. అదేవిధంగా మాస్క్ ధరించని వారికి రూ.1000 జరిమానా విధిస్తామన్నారు. కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలందరూ సహకరించాలన్నారు.
కరోనా నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేలా మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీ, పోలీసు శాఖలకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించరాదని, ప్రజలు గుంపులుగా గుమి కూడవద్దని, వివిధ పండుగలతో పాటు మతపరమైన కార్యక్రమాలపై ఆం క్షలు వర్తిస్తాయని కలెక్టర్ మరోసారి స్పష్టం చేశారు. నిబంధనల మేరకు మాస్క్ లు ధరించడంతో పాటు భౌతిక దూ రం, వ్యక్తిగత శుభ్రత పాటించాలని సూచించారు. వ్యాక్సిన్పై ఎలాంటి అపోహలు వద్దన్నారు. కరోనా లక్షణాలు ఏ మాత్రం కనిపించినా తమ దగ్గరలోని పీహెచ్సీ, ప్రభుత్వ దవాఖానకు వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని హితవు పలికారు. మీ ప్రాణా లు మీ చేతుల్లోనే ఉన్నాయన్న విషయాన్ని మరిచిపోవద్దన్నారు. కరోనా నిబంధనలు పాటించి జిల్లాలో కరోనా వ్యాప్తిని అరికట్టడంలో ప్రజలందరూ సహకరించాలని కలెక్టర్ కోరారు.