Srisailam | భక్తుల సౌకర్యార్థం శ్రీశైల దేవస్ధానం నిర్వహిస్తున్న నిత్యాన్నదాన పథకానికి విరివిగా విరాళాలు వస్తున్నాయి. హైద్రాబాద్-రంగారెడ్డి జిల్లా వాసి శంకరప్ప రూ. లక్ష, పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఆనంద విజయ దంపతులు విరాళాలు ఇచ్చారు.
ఆదివారం ఏఈవో మల్లయ్య, ఆలయ పర్యవేక్షకుడు రవికుమార్కు దాతలు విరాళాన్ని చెక్ రూపంలో అందించారు. ఈ సందర్భంగా దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మవార్ల ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రాన్ని అందజేశారు.