అమరావతి : ఏపీలో ఉద్యోగులకు సంబంధించిన పీఆర్సీ, తదితర సమస్యలను పరిష్కరించాలని ఉద్యోగులు సీఎం జగన్ ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. గత కొన్ని రోజులుగా ప్రభుత్వం ఊరిస్తున్న పీఆర్సీపై తీవ్ర జాప్యం చేస్తుండడం పట్ల రెండు రోజుల క్రితం ఉద్యోగ జేఏసీ సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి.
ఈ నేపథ్యంలో శుక్రవారం వరద బాధితులను పరామర్శించేందుకు తిరుపతికి వచ్చిన ముఖ్యమంత్రికి ఉద్యోగులు ప్లకార్డులను ప్రదర్శించారు. అనంతరం సీఎంతో మాట్లాడిన ఉద్యోగులకు జగన్ తీపి కబురు చెప్పారు. పీఆర్సీ ప్రక్రియ పూర్తయిందని, మరో పదిరోజుల్లో పీఆర్సీని ప్రకటిస్తామని స్పష్టం హామీ ఇచ్చారు.