Srisailam | శ్రీశైల శ్రీభ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల దేవస్థానం నిర్వహిస్తున్న వివిధ పథకాలకు భక్తులు విరాళాలు ఇచ్చారు. సోమవారం నిత్యాన్నధాన పథకానికి నంద్యాల జిల్లా డోన్ వాసి కేశవరెడ్డి కుటుంబ సభ్యులు రూ1,00,116 , కడప నివాసి రామసుబ్బారెడ్డి రూ 2,02,232, నెల్లూరు వాసి చెన్నప్పనాయుడు దంపతులు రూ1,01,116, సుష్మ కుటుంబ సభ్యులు రూ.లక్ష, గోసంరక్షణ నిధికి గుంటూరు వాసి శేషిరెడ్డి కుటుంబసభ్యులు రూ. లక్ష విరాళాన్ని చెక్కు రూపంలో అందించారు.
ఈ విరాళాలను దాతలు ఆలయ ఏఈవో ఫణిధర ప్రసాద్, పర్యవేక్షకుకులు హిమబిందు, నాగరాజులకు అందించారు. దాతలకు శ్రీభ్రమరాంబికా మల్లికార్జున స్వామి అమ్మ వార్ల దర్శనాన్ని కల్పించి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం స్వామి అమ్మవార్ల శేషవస్త్రాలు, ప్రసాదాలు, ఙ్ఞాపిక పత్రం అందజేశారు.