Srisailam | శ్రీశైల మహాక్షేత్రంలో మహా కుంభాభిషేక మహోత్సవాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. ఇవాళ ( శుక్రవారం ) మొదలైన ఈ ఉత్సవాలు ఈ నెల 21వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ వేడుకల సందర్భంగా శ్రీభ్రమరాంబిక మల్లిఖార్జున స్వామి అమ్మవార్లను ఏపీ డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, శ్రీశైల జగద్గురు పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ చెన్న సిద్ధరామ శివాచార్య మహాస్వామిజీ దర్శించుకున్నారు. వారికి ఆలయ ఈవో పెద్దిరాజు, అర్చకులు స్వాగతం పలికారు.