అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో ఐదో నిందితుడు శివ శంకర్రెడ్డికి కడప కోర్టు బెయిల్నిరాకరించింది. కడపలో రిమాండ్ ఖైదీగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్రెడ్డి బెయిల్ పిటిషన్ వేయగా ఈరోజు విచారణకు రాగా కోర్టు తిరస్కరించింది.
అనారోగ్య కారణాలతో రిమ్స్లో చికిత్సపొందుతున్నానని తనకు బెయిల్ ఇవ్వాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో పిటిషనర్ తరుఫున న్యాయవాది, సీబీఐ న్యాయవాది మధ్య వాదనలు జరుగగా బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ చేసిన వాదనలతో కడప కోర్టు ఏకీభవించింది. దీంతో నిందితుడికి బెయిల్ పిటిషన్ను కొట్టివేస్తున్నట్లు కోర్టు వెల్లడించింది.