అమరావతి: ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గన్నవరంలో విషాదం చోటుచేసుకుంది. గన్నవరం మండలం చిన్న అవుటపల్లి పిన్నమనేని కోవిడ్ ఆసుపత్రి మూడో అంతస్తుపై నుండి కిందకు దూకి కరోనా రోగి మృతి చెందాడు. తీవ్రంగా గాయపడిన రోగి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తేలప్రోలు శివారు కొత్తూరు గ్రామనికి చెందిన పోలిబోయిన రోశయ్య (50)గా గుర్తించారు. ఈఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.