అమరావతి : కొవిడ్ కారణంగా ఆంక్షల మధ్య కొనసాగుతున్న ప్రభుత్వ కార్యాలయాలకు అధికారులు పూర్తి స్థాయిలో హాజరయ్యే విధంగా ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సినిమా థియేటర్లలో వందశాతం ఆక్యుఫెన్సీకి అనుమతినిచ్చిన ప్రభుత్వం ఈరోజు ఏపీ సచివాలయంలో కొవిడ్ ఆంక్షలు ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది . అన్ని శాఖల కార్యదర్శులు సచివాలయానికి రావాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు జారీ చేశారు. ఇకపై ఉన్నతాధికారులు సచివాలయం నుంచే విధులు నిర్వహించాలని సూచించారు. ఉన్నతాధికారులు కూడా బయోమెట్రిక్, ఫేస్ రికగ్నిషన్ పాటించాలని ఆయన ఆదేశించారు.
సీఎస్, మంత్రులు, ప్రభుత్వ సమావేశాలకూ భౌతికంగా హాజరు కావాలని ఉత్తర్వులో పేర్కొన్నారు. గడిచిన కొన్ని నెలలుగా ఇంటి నుంచి పనిచేయడం, వర్చువల్ విధానం ద్వారా సమావేశాలకు హాజరు అయ్యారు. కొవిడ్ తగ్గుముఖం పట్టడం వల్ల అందుబాటులో ఉండి ప్రజలకు సేవలందించడానికి నిర్ణయం తీసుకున్నారు. కాగా ఏపీలో రాష్ట్రంలో నిన్న 528 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం 9.470 యాక్టివ్ కేసులున్నాయి.