అమరావతి : ప్రకాశం జిల్లా ఒంగోలు రిమ్స్ మెడికల్ కాలేజీలో కరోనా కలకలం రేపుతుంది. కళాశాలకు చెందిన 20 మంది మొదటి సంవత్సరం మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయ్యింది . కరోనా సోకిన కొంతమంది విద్యార్థులను హోం ఐసోలేషన్కు మరికొంతమందిని రిమ్స్లో చికిత్స అందిస్తున్నారు. మరో నాలుగురోజుల్లో పరీక్షలు ఉండడంతో విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కరోనా వ్యాప్తి మూలనా పరీక్షలు వాయిదా వేయాలని విద్యార్థులు వర్శిటీ అధికారులను కోరుతున్నారు.