(YS Jagan) గుంటూరు: మంచి పనులు చేపడుతుంటే విమర్శించేవారికి ఈ కొత్త సంవత్సరంలోనైనా వారికి సద్బుద్ధి రావాలని కోరుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చెప్పారు. క్యాలెండర్లో నెలలు మాత్రమే కాదు పేదల జీవితాలను కూడా మార్చాలన్నారు. గుంటూరు జిల్లాలో పర్యటిస్తున్న సీఎం జగన్.. ప్రత్తిపాడులో నిర్వహించిన బహిరంగసభలో ప్రసంగించారు. ఆర్థికంగా ఎలాంటి ఆధారం లేనివారిని ఆదుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. పేదలకు ప్రభుత్వ పరంగా ఆర్థిక సేవలు అందకుండా ప్రతిపక్ష పార్టీ అడ్డుకుంటున్నదని ఆరోపించారు.
ప్రభుత్వం చేపట్టే అన్ని మంచి పనులను విమర్శించడమే పనిగా కొందరు మాట్లాడుతున్నారని, వారు ఈ కొత్త ఏడాదిలో మారితే బాగుంటుందని సీఎం జగన్ చురకలంటించారు. గతంలో ఇచ్చిన మాట ప్రకారం వృద్ధుల పెన్షన్ మొత్తాన్ని రూ.3 వేలకు పెంచుతున్నట్లు ప్రకటించారు. పెరిగిన పెన్షన్ మొత్తాన్ని ఈ నెల నుంచే వర్తింపజేస్తామన్నారు. ఫించన్లను ఇవాల్టి నుంచే వాలంటీర్లు నేరుగా ఇంటికే వచ్చి చెల్లిస్తారని చెప్పారు. ఫించన్లు అందనివారు గ్రామ సచివాలయంలో సంప్రదించాలని సూచించారు. గత ప్రభుత్వం పెన్షన్ల కోసం కేవలం రూ.400 కోట్లు ఖర్చు చేయగా, తమ ప్రభుత్వం రూ.1,570 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు జగన్ తెలిపారు.
గాడిద పాలు ఆరోగ్యానికి మంచివేనా ? వాటికి ఎందుకంత డిమాండ్ ?
శృంగారంపై ఆసక్తి తగ్గిపోయిందా.. అయితే ఈ ఫుడ్స్ తీసుకోండి..
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..