హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): టీటీడీ పాలకమండలి సభ్యుల నియామకాలను సవాల్ చేస్తూ సోమవారం హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. నేరచరిత్ర, లికర్ వ్యాపారులను బోర్డు సభ్యులుగా నియమించడం సరి కాదని చింతా వెంకటేశ్వర్లు పిటిషన్ వేశారు.
టీటీడీ బోర్డు సభ్యులుగా నియమితులైన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాలను ఆయన సవాల్ చేశారు. ఈ ముగ్గురిని టీటీడీ బోర్డు పదవి నుంచి తొలిగించాలని పిటిషన్లో పేరొన్నారు. ఈ అంశం కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలతో ముడిపడి ఉందని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.