అమరావతి : ఆంధ్రప్రదేశ్ నుంచి అక్రమ రవాణా అవుతున్న బియ్యాన్ని అడ్డుకోవాలని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్కు లేఖ రాశారు. పేదలకు పంచవలసిన రేషన్ బియ్యాన్ని కొందరు ఏపీ -తమిళనాడు సరిహద్దు ప్రాంతాలకు అక్రమంగా తరలిస్తున్నారని వివరించారు. తమిళనాడు-చిత్తూరు సరిహద్దులోని 7 మార్గాల ద్వారా రైస్ మాఫియా బియ్యం తరలిస్తున్నారని పేర్కొన్నారు.
ఇరు రాష్ట్రాల సరిహద్దులో గట్టి నిఘా పెంచాలని కోరారు. రేషన్ బియ్యాన్ని స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డ వాహనాలు, స్మగర్ల ఫొటోలను తమిళనాడు సీఎంకు రాసిన లేఖతో జత చేశారు.