అమరావతి : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు(Chandra Babu) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary) కి లేఖ రాశారు. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏపీలో వాలంటీర్లతో పింఛన్ల పంపిణీని (Pensions distribution) రద్దు చేశారు.
దీంతో చంద్రబాబు సీఎస్తో పాటు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ( State Election Officer) కి కూడా లేఖ రాశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వాలంటీర్లచే కాకుండా ప్రభుత్వ ఉద్యోగులతో పింఛన్లను పంపిణీ చేయాలని కోరారు. గతంలో మాదిరిగానే ఒకటో తేదీన పింఛన్లు పంపిణీ చేయాలని కోరారు. పింఛన్ల కోసం నిధులను ప్రభుత్వం సమకూర్చలేదనే వార్తలు వస్తున్నాయని, పింఛన్ల కోసం అవసరమైన నిధులను అందుబాటులో ఉంచాలని సూచించారు.