Ayodhya Ram Mandir | అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి ప్రాణప్రతిష్ట (Pran Pratistha) వైభవంగా జరగనున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఇప్పటికే దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. కార్యక్రమానికి మరో ఐదు రోజులే సమయం ఉండటంతో నిర్వాహకులు ఆహ్వానాలు అందించే ప్రక్రియను కూడా వేగవంతం చేశారు.
ఇప్పటికే రాజకీయ, వ్యాపార, సినీ, క్రీడా రంగానికి చెందిన పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు అందిన విషయం తెలిసిందే. తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి (Chandrababu)కి ఆహ్వానం అందింది. ఈనెల 22న అయోధ్య రామజన్మభూమి దేవాలయంలో జరగనున్న ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి (Ram Mandir inauguration) రావాల్సిందిగా శ్రీ రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు.. చంద్రబాబుకు ఆహ్వానం పంపించారు.
హిందువుల చిరకాల స్వప్నమైన రామమందిర నిర్మాణం సాకారమైంది. ఈ సందర్భంగా రాముడి ప్రాణ ప్రతిష్ట వేడకకు రామాలయ ట్రస్ట్ 7 వేల మందికి ఆహ్వానాలు పంపింది. వీళ్లలో రాజకీయ, సినీ ప్రముఖులతో పాటు క్రికెట్ దిగ్గజాలు కూడా ఉన్నారు. వీళ్లలో మాజీ సివిల్ సర్వీసెంట్లు, ఆర్మీ అధికారులు, న్యాయవాదులు, ఇంద్రజాలికులతో పాటు పద్మశ్రీ, పద్మ భూషన్ అవార్డు విజేతలు ఉన్నారు. ఇక జనవరి 22న మధ్యాహ్నం 12.20 గంటలకు రాముడి ప్రాణ ప్రతిష్ఠ జరగనుంది.
Also Read..
Stray dogs | భోపాల్లో వీధికుక్కల వీరంగం.. ఒక్కరోజే 40 మందిపై దాడి
Lalu Yadav | ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి వెళ్లడం లేదు : లాలూ యాదవ్
Virat Kohli | విరాట్ దంపతులకు అందిన రాముడి ప్రాణ ప్రతిష్ట ఆహ్వానం.. ఫొటో వైరల్