అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 36 గంటల పాటు నిరసన దీక్ష చేపట్టనున్నారు. నిన్న ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కార్యాలయాలపై జరిగిన దాడికి నిరసనగా గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు దీక్షలో కూర్చోనున్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తల దాడిలో ధ్వంసమైన సామగ్రి మధ్యలోనే దీక్షలో దిగనున్నారు. మరో వైపు రాష్ట్రంలో పరిస్థితులపై కేంద్రానికి దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఈ మేరకు శనివారం కేంద్ర మంత్రి అమిత్షాను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరారు. కేంద్ర హోంశాఖ మంత్రిని కలిసి టీడీపీ కార్యాలయంలో జరిగిన దాడులపై ఫిర్యాదు చేసే అవకాశం ఉన్నది.