అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టీడీపీ(TDP) పార్లమెంట్ అభ్యర్థులను ఖరారు చేసింది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు( Chandra Babu) శుక్రవారం 13 మంది ఎంపీ, 11 మంది అసెంబ్లీ అభ్యర్థుల(Candidates) పేర్లను ప్రకటించారు. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఏర్పడి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీకాకుళం పార్లమెంట్ స్థానానికి మరోసారి కింజరావు రామ్మోహన్నాయుడు(Rammohan Naidu) కు అవకాశం దక్కింది. విశాఖపట్నం నుంచి మాత్కుపల్లి భరత్, అమరలాపురం నుంచి గంటి హరీష్ మాధుర్, ఏలూరు లో పుట్టా మహేష్యాదవ్, విజయవాడలో కేశినేని శివనాథ్(చిన్ని)కు అవకాశం కల్పించారు.
గుంటూరు నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, నరసరావుపేట నుంచి లావు శ్రీ కృష్ణదేవరాయలు, బాపట్ల నుంచి టి. కృష్ణప్రసాద్, నెల్లూరు నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, చిత్తూరు నుంచి దగ్గుమళ్ల ప్రసాద్రావు, కర్నూలు నుంచి బస్తిపాటి నాగరాజు, నంధ్యాల బైరెడ్డి శబరి, హిందూపూర్ నుంచి బీకే. పార్థసారథి టీడీపీ ఎంపీ అభ్యర్థులుగా పోటీ చేస్తున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఏపీలో మొత్తం 25 స్థానాలకు గాను టీడీపీ 17, బీజేపీ 6, జనసేన 2 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. మరో 4 ఎంపీ స్థానాలను పెండింగ్లో పెట్టారు.