అమరావతి : ఏపీ ముఖ్యమంత్రి (AP CM) వైఎస్ జగన్ మోహన్రెడ్డికి సీబీఐ కోర్టు (CBI Court)లో ఊరట లభించింది. యూకేలో ఉన్న తన కూతుళ్లను చూసేందుకు విదేశాలకు వెళ్లడానికి అనుమతిలివ్వాలంటూ జగన్ పిటిషన్ను పెట్టుకున్నారు. తాను తన కుటుంబ సమేతంగా వెళ్లేందుకు అనుమతివ్వాలని కోరారు. బుధవారం పిటిషన్ను పరిశీలించిన సీబీఐ కోర్టు నిర్ణయాన్ని గురువారం నాటికి వాయిదా వేసింది.
గురువారం కోర్టు వేళలు ప్రారంభం కాగానే పిటిషన్ను పరిశీలించిన కోర్టు న్యాయమూర్తులు సెప్టెంబర్ 2 నుంచి 12వ తేదీ వరకు జగన్ విదేశాలకు వెళ్లేందుకు అనుమతినిచ్చారు. అదే మాదిరిగా రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కూడా విదేశాలకు వెళ్లేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది.