అమరావతి : ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి(YS Jagan) విదేశాలకు (Abroad) వెళ్లేందుకు అనుమతి కోరుతూ సీబీఐ కోర్టు(CBI Court) లో వేసిన పిటిషన్పై బుధవారం మరోసారి వాదనలు జరిగాయి. జగన్ విదేశి పర్యటనకు అనుమతి ఇవ్వొద్దని సీబీఐ కౌంటర్ పిటిషన్ దాఖలు చేసింది. ఇరువురి పిటిషన్లపై వాదనలు ముగియగా ఈనెల 27కు నిర్ణయాన్ని వాయిదా వేశారు.
సెప్టెంబర్లో యూకే(UK) వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని జగన్, సెప్టెంబర్, అక్టోబర్లో యూరప్ వెళ్లేందుకు రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కోర్టులో వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. విజయసాయి రెడ్డి (Vijayasai Reddy) పిటిషన్పై వాదనలు పూర్తి కాగా ఈ నెల 30వ తేదీకి తీర్పు వాయిదా వేశారు.
మే 13న ఏపీలో సార్వత్రిక ఎన్నికలు ముగిసిన అనంతరం జగన్15 రోజుల పాటు కుటుంబంతో కలిసి జగన్ విదేశీ ప్రయాణం చేశారు. ఈ మేరకు జగన్ విదేశీ పర్యటన వెళ్లేందుకు నాంపల్లి సీబీఐ కోర్టు కొన్ని ఆంక్షలు విధిస్తూ అనుమతి ఇచ్చింది. యూకే, స్విట్జర్లాండ్, ఫ్రాన్స్ దేశాల్లో జగన్ పర్యటించారు. ఏపీలో ఓటమి తరువాత వైఎస్ జగన్ విదేశాలకు వెళ్లడం ఇదే ప్రథమం.