అనంతపురం: ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో (Ananthapuram) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొని.. దానిపై ఉన్న వ్యక్తిని 18 కిలోమీటర్ల దూరం కారుతోసహా లాక్కెళ్లాడు. సోమవారం తెల్లవారుజామున ఆత్మకూరు మండలం వై కొత్తపల్లి సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు.. ఓ ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టింది. దీంతో బైక్పై ఉన్న వ్యక్తి ఎగిరి కారు బానెట్పై పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న డ్రైవర్ దానిని గమనించుకోకుండా 18 కిలోమీటర్ల దూరం అలాగే వెళ్లిపోయాడు.
గమనించిన స్థానికులు కారును అడ్డుకున్నారు. దీంతో డ్రైవర్ కారును అక్కడే వదిలి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడిని కూడేరు మండలం చోళ సముద్రానికి చెందిన ట్రాక్టర్ మెకానిక్ ఎర్రిస్వామిగా గుర్తించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నారు.