అమరావతి : బుల్లెట్ రైళ్ల ( Bullet Train ) ద్వారా దక్షిణాది ముఖ చిత్రం మారబోతుందని కేంద్ర అశ్వినీ వైష్ణవ్ ( Union Minister Ashwini Vaishnaw ) తెలిపారు. విశాఖ జిల్లా తర్లువాడలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
బుల్లెట్ ట్రైన్ ద్వారా అమరావతి( Amaravati ), హైదరాబాద్ ( Chennai ) , చెన్నై, బెంగళూరు మధ్య కనెక్టివిటీ పెరగబోతుందని వివరించారు. అమరావతి నుంచి హైదరాబాద్కు కేవలం 70 నిమిషాల్లో చేరుకోవచ్చని వెల్లడించారు. దక్షిణాది పట్ల వివక్ష లుందని విపక్షాలు తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయని తెలిపారు.
రైల్వేలు, హైవేలు, విద్యుత్, పోర్టులు అన్ని రంగాల్లో దక్షిణాదికి భారీ పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి అన్నారు. గతంలో ఉమ్మడి ఏపీలో కేవలం రూ.8 వందల కోట్లు మాత్రమే రైల్వే నిధులు వచ్చేవని, ప్రస్తుతం ఒక్క ఏపీకే రూ.10 వేల కోట్లకు పైగా నిధులు వస్తున్నాయని వివరించారు. జూన్ 1న దక్షిణా కోస్తా రైల్వేజోన్ ప్రారంభమవుతుందని వెల్లడించారు.