(Fatal Accident) విజయనగరం జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్మీ జవాన్ మృతి చెందాడు. కుటుంబంతో గడిపేందుకు ఆరు రోజుల క్రితమే సొంతూరుకు వచ్చి రోడ్డు ప్రమాదంలో బలయ్యాడు. ఒక్కగానొక్క కొడుకు రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆ జవాన్ కుటుంబంలో విషాదం నెలకొన్నది. ఈ ఘటన బొండపల్లి మండలం గొట్లాం సమీపంలో 26వ నంబరు జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగింది.
ఎస్ఐ ఆర్ వాసుదేవ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నెల్లిమర్ల మండల కేంద్రంలోని గాంధీనగర్ కాలనీకి చెందిన అడ్డు త్రినాథరావు (30) ఆర్మీలో జవానుగా పని చేస్తున్నాడు. ప్రస్తుతం జమ్ముకశ్మీర్లో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆరు రోజుల క్రితమే సెలవుపై ఇంటికి వచ్చిన త్రినాథరావు.. బైక్పై గజపతినగరం వైపునకు వెళ్తుండగా గొట్లాంకు సమీపంలో ప్రమాదం జరిగింది. దాంతో తీవ్రంగా గాయపడిన త్రినాథరావు అక్కడికక్కడే చనిపోయాడు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం గజపతినగరంలోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మృతుడు త్రినాథరావు విజయనగరం బొగ్గులుదిబ్బలో నివసించే తన అక్క కూతురైన కీర్తిని మూడేండ్ల క్రితం పెండ్లి చేసుకున్నాడు. త్రినాథరావు మృతితో ఆయన స్వగ్రామం నెల్లిమర్లలోని గాంధీనగర్లో, అక్క ఉంటున్న విజయనగరంలోని బొగ్గులదిబ్బలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మరికొన్ని రోజుల్లో తిరిగి విధుల్లో చేరాల్సి ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు.
జుట్టు రాలడం ఆగాలంటే ఏం చేయాలి.. రోజూ షాంపూ పెట్టొచ్చా ?
ఉదయాన్నే ఈ ద్రావణం తాగితే అదుపులో డయాబెటిస్..!
కనురెప్పల అందానికి వంటింటి చిట్కాలు.. అవి ఏంటో తెలుసా..?
చేపలను తరచూ తింటే కలిగే అద్భుత ప్రయోజనాలివే..!
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..