అమరావతి : ఏపీలోని నిరుద్యోగులకు శుభవార్త. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 22 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) నోటిఫికేషన్ విడుదల చేసింది. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో 22 ఎక్స్టెన్షన్ ఆఫీసర్ గ్రేడ్-1 పోస్టులకు ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ను విడుదల చేసింది. ఈ నెల18 నుంచి డిసెంబర్ 8వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నారు. గడువు తేదీ డిసెంబర్ 7. నోటిఫికేషన్కు సంబంధించిన పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో చూడొచ్చు.
ఈ ఉద్యోగాలకు మహిళలు మాత్రమే అర్హులు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. అభ్యర్థులు కమిషన్ ప్రకటించిన విధంగా ఆయా విభాగాల్లో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.