హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అపోలో హాస్పిటల్స్ గ్రూప్ రూ.2 కోట్ల విరాళం అందచేసింది. అందులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధికి అపోలో హాస్పటల్ గ్రూప్ రూ.కోటి విరాళం ప్రకటించింది. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్ఆర్) కింద రూ.కోటి అందజేసింది.
మొత్తం రూ.2కోట్ల విరాళాల చెక్కులను తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన రెడ్డికి అపోలో హాస్పిటల్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ఛైర్పర్సన్ ప్రీతారెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రూప్ ప్రెసిడెంట్, సీఈవోలు నరోత్తమ్రెడ్డి, కే ప్రభాకర్, శివరామకృష్ణన్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Tesla HatchBach Affordable| 2023లో చౌకగా హ్యాచ్బ్యాక్ టెస్లా కారు.. ధరెంతంటే?!
Ola vs Tesla | టెస్లాకు ముందే అమెరికాలోకి ఓలా స్కూటర్ ఎంట్రీ.. ?!