అమరావతి: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు శైలజనాథ్ కు కోవిడ్ పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. ఇదే విషయాన్ని ఆయన బుధవారం ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం హెూమ్ ఐసోలేషన్ లోనే ఉండి చికిత్స తీసుకుంటున్నట్లు తెలిపారు. కోవిడ్ నియమావళిని కచ్చితంగా పాటిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నానని, ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ తనకు వైరస్ సోకిందని, అయితే ఎవరూ అందోళన పడాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు.
ఇటీవల తనను కలిసిన వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు పాటించాలని సూచించారు. తాను ఆరోగ్యంగానే ఉన్నానని, త్వరలోనే అందరికీ అందుబాటులోకి వస్తానని శైలజనాథ్ తెలిపారు.