అమరావతి : టీడీపీ అధినేత చంద్రబాబు (Chandra Babu) కు ఏపీ హైకోర్టు(High Court) లో భారీ ఊరట లభించింది. అధికారంలో ఉన్నపుడు ఐఆర్ఆర్, మద్యం, ఇసుక కేసులో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారంటూ ఏపీ సీఐడీ చంద్రబాబుపై కేసులు నమోదు చేసింది. అయితే ఈ కేసుల్లో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. వీటిని పరిశీలించిన ఏపీ హైకోర్టు పలుమార్లు విచారించి తీర్పును రిజర్వ్ చేశారు.
బుధవారం వాటిని పరిశీలించిన హైకోర్టు జడ్జి జస్టిస్ టి. మల్లికార్జునరావు మూడుకేసుల్లో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ మంజూరు చేయడం ఊరట కలిగించింది. అమరావతి ఔటర్ రింగ్ మాస్టర్ ప్లాన్ అలైన్మెంట్లో పార్టీ నాయకులకు అనుకూలంగా అలైన్మెంట్ చేశారని మద్యం టెండర్లలలో, ఉచిత ఇసుక వ్యవహారంలోనూ అక్రమాలకు పాల్పడారని సీఐడీ కేసులు నమోదు చేసింది. ఈ మూడు కేసుల విచారణ పూర్తయ్యేంతవరకు కేసులపై మాట్లాడవద్దని కోర్టు చంద్రబాబుకు సూచించింది. అదేవిధంగా మద్యం కేసులో కొల్లు రవీంద్ర, విశ్రాంత ఐఏఎస్ శ్రీనరేష్కు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తు తీర్పును ప్రకటించారు.