హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ) : ఏపీపీఎస్సీ 2018 డిసెంబర్లో నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షను రద్దు చేయాలని ఆ రాష్ట్ర హైకోర్టు బుధవారం తీర్పునిచ్చిన నేపథ్యంలో ఉద్యోగులకు భరోసా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఉద్యోగులెవరూ ఆందోళన చెందవద్దని, హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీలుకు వెళతామని ప్రకటించింది.
జవాబుపత్రాల మ్యానువల్ మూల్యాంకనంలో భారీగా అక్రమాలు చోటు చేసుకున్నాయని, రెండుసార్లు మ్యానువల్ విధానంలో మూల్యాకనం చేయడం చట్టవిరుద్ధమని పేర్కొంటూ పలువురు అభ్యర్థులు గతంలో ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు జరిగాయని గుర్తించి మెయిన్స్కు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేసింది. ఆరునెలల్లో మళ్లీ పరీక్ష నిర్వహించాలని, పరీక్షకు ముందు అభ్యర్థులకు కనీసం రెండు నెలల సమయం ఇవ్వాలని ఏపీపీఎస్సీని ఆదేశించింది. హైకోర్టు తాజా తీర్పుతో ప్రస్తుతం గ్రూప్ -1 అధికారులుగా ఉన్న 143 మంది ఉద్యోగాలు కోల్పోయినైట్లెంది.