అమరావతి : అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు( Chandra Babu) బెయిల్ పిటిషన్ (Bail Petition)పై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టు (Supreme Court) లో పిటిషన్ను దాఖలు చేసింది. హైకోర్టు ఇచ్చిన బెయిల్ మంజూరును సవాల్ చేస్తూ చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలని సుప్రీంను కోరింది.
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు(Inner Ring Road) కేసులో చంద్రబాబుపై సీఐడీ నమోదు చేసిన కేసులో ఏపీ హైకోర్టులో జనవరి 10న విచారణ జరుగగా కోర్టు చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసింది. చంద్రబాబు బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ కేసు ఈ నెల 29న ఈ కేసు విచారణకు వచ్చే అవకాశం ఉంది.
రాజధాని అమరావతి మాస్టర్ ప్లాన్ డిజైనింగ్తో పాటు ఐఆర్ఆర్ ఎలైన్మెంట్ రూపకల్పనలో అక్రమాలు జరిగాయని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ కేసు నమోదు చేయగా చంద్రబాబు హైకోర్టులో ముందస్తు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసి బెయిల్ పొందారు.