అమరావతి : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరోమారు హైకోర్టులో చుక్కెదురు అయ్యింది. డిగ్రీ కళాశాలల్లో యాజమాన్య కోటాలో 30శాతం సీట్ట భర్తీకి కన్వీనర్ నోటిఫికేషన్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిబంధనను కోర్టు ఈ రోజు కొట్టివేసింది. యాజమాన్య కోటాలో సీటు పొందిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఓబీసీలకు కూడా జగనన్న విద్యాదీవెన వర్తింపజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
ప్రభుత్వ నిబంధనలు సమంజసంగా లేవని హైకోర్టు పేర్కొంది. యాజమాన్య కోటాను కన్వీనర్ భర్తీ చేస్తామన్న ప్రభుత్వ నిబంధనపై రాయలసీమ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించగా ఈ మేరకు శుక్రవారం హైకోర్టు ఇరువురి వాదనలు విని తీర్పును వెల్లడించింది.