AP News | ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సీపీఎస్లో అఖిల భారత సర్వీస్ అధికారులకు ప్రభుత్వం జమ చేసే వాటాను భారీగా పెంచింది. ఎన్పీఎస్లో ప్రభుత్వం జమ చేసే వాటాను 10 శాతం నుంచి 14 శాతానికి పెంచింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
పెంచిన వాటాను 2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి వర్తింపజేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. డిప్యుటేషన్పై పనిచేసే ఏఐఎస్, సీసీఎస్ అధికారులకూ ఆదేశాలు వర్తింపజేయాలని పేర్కొంది . ఈ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ట్రెజరీలు, ఖాతాల డైరెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది.