ఎస్పీ అపూర్వరావు
కొత్తకోట, ఏప్రిల్ 28 : కరోనా నివారణకు జిల్లాలోని ప్రజలంతా కొవిడ్ వ్యాక్సిన్ను ప్రతిఒక్కరూ తీసుకోవాలని ఎస్పీ అపూర్వరావు అన్నారు. బుధవారం మండలంలోని రాయినిపేట గ్రామంలో కరోనా నివారణపై ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించగా ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆమెతో పాటు డీఎస్పీ కిరణ్కుమార్రెడ్డి, జెడ్పీవైస్ చైర్మన్ వామన్గౌడ్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలనారాయణ, రైతుబంధు మండల అధ్యక్షులు కొండారెడ్డి, ఎంపీపీ గుంతమౌనిక, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్ పాల్గొన్నారు. అనంతరం సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు ఆకుల శ్రీను అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కొవిడ్ను మొదటి దశ కన్న రెండో దశ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో పోలీసులతోపాటు ప్రజలందరూ తప్పకుండా టీకాను వేయించుకోవాలన్నారు. అందులో పోలీసు శాఖ ప్రత్యేక దృష్టి సారించిందని అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. కొందరు అపోహాలకు గురి చేస్తున్నారని వాటిని నమ్మవద్దన్నారు. . ఇంటి నుంచి బయటకు వెళ్లే ప్రతిఒక్కరూ మాస్కులు ధరించాలని, బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా ఉండొద్దన్నారు. మే 1 నుంచి 18 ఏండ్లు నిండిన వారికి కూడా కొవిడ్ వ్యాక్సిన్ టీకాను వేయనున్నట్లు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ మల్లికార్జున్రెడ్డి, ఎస్సై నాగశేఖర్రెడ్డి, ఎంపీడీవో శ్రీపాదు, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, వైద్యాధికారి ప్రవీణ్, ఎంపీటీసీ రాధమ్మ, గ్రామస్తులు సంపత్కుమార్రెడ్డి, పాండురంగయ్య, బాలయ్య పాల్గొన్నారు.
నేరాలు అరికట్టేందుకు సీసీలు దోహదపడుతాయి
కొత్తకోట, ఏప్రిల్ 28 : నేరాలను అరికట్టేందుకు సీసీ కెమెరాలు దోహదపడుతాయని ఎస్పీ అపూర్వరావు అన్నారు. బుధవారం మండలంలోని రాయినిపేట గ్రామంలో గ్రామస్తుల సహకారంతో ఏర్పాటు చేసుకున్న 11 సీసీ కెమెరాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ దొంగతనాలు జరిగితే సీసీ కెమెరాల ద్వా రా నేరస్తులను గుర్తించవచ్చన్నారు. గ్రామస్తులు గ్రామ పంచాయతీ నిధుల నుంచి రూ.2.20లక్ష లు, దాతలు రూ.70వేలు సీసీ కెమెరాలను ఏర్పా టు చేసుకున్నట్లు ఆ గ్రామ సర్పంచు ఆకుల శ్రీను తెలిపారు. ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకునే విధంగా ఆయా గ్రామాల ప్ర జాప్రతినిధులకు అవగాహన కల్పించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో డీఎస్పీ కిరణ్కుమా ర్, జెడ్పీ వైస్ చైర్మన్ వామన్గౌడ్, సీడీసీ చైర్మన్ చెన్నకేశవరెడ్డి, ఎంపీపీ గుంతమౌనిక, మార్కెట్ కమిటీ చైర్మన్ బాలనారాయణ, రైతు సంఘం మండలాధ్యక్షుడు కొండారెడ్డి, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, ఎంపీడీవో శ్రీపాదు, తాసిల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీటీసీ రాధమ్మ, సంపత్రెడ్డి, పాండుయాదవ్, భీంరెడ్డి పాల్గొన్నారు