అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సోమవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. రాష్ట్రంలో నెలకొన్న ప్రధాన అంశాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్రమోదీని కలువనున్నారు. పోలవరం ప్రాజెక్టు, విభజన హామీలతో సహా , రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలను పరిష్కారించాలని ప్రధానిని కోరనున్నారు.
పోలవరం ప్రాజెక్టు రివైజ్డ్ ఎస్టిమేషన్ ప్రకారం రాష్ట్రానికి రావాల్సిన నిధులు, వివిధ పథకాల కింద రాష్ట్రానికి పెండింగ్లో ఉన్న బకాయిల గురించి స్వయాన పీఎం దృష్టికి తీసుకెళ్లనున్నారు. ఇటీవల రాష్ట్రంలో బీజేపీ ఎంపీలు, రాష్ట్ర నాయకులు ప్రభుత్వంపై చేస్తున్న ఆరోపణలు, రాష్ట్రంలో పలు కట్టడాలపై చేస్తున్న వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్న తరుణంలో జగన్ ఢిల్లీ పర్యటనపై ప్రాధాన్యత సంతరించుకుంది.