కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమావేశమయ్యారు. ఏపీ ఆర్థిక పరిస్థితులపై చర్చించారు. పెండింగ్ అంశాలపై కూడా చర్చించారు. ఇక ఈ సమావేశం తర్వాత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కేంద్ర హోంమంత్రితో కూడా సమావేశమయ్యారు. ఇక మరో కేంద్ర మంత్రి షెకావత్తో కూడా ఏపీ సీఎం జగన్ సమావేశమయ్యారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. దాదాపు గంట పాటు వీరిద్దరి భేటీ కొనసాగింది. ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రధానికి తిరుపతి వేంకటేశ్వర స్వామి చిత్ర పటాన్ని బహూకరించారు. ఇక.. పోలవరం విషయంలో సవరించిన అంచనాలను ఆమోదించాలని సీఎం జగన్ ప్రధానిని కోరినట్లు తెలుస్తోంది. అలాగే ఏపీకి ఆర్థిక చేయూతను కూడా అందించాలని, విభజన చట్టంలోని పెండింగ్ అంశాలను పూర్తి చేయాలని సీఎం ప్రధాని మోదీని కోరినట్లు సమాచారం.