విశాఖపట్నం: బీజేపీ సీనియర్ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు (GVL Narasimha Rao) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రుణం తీసుకోకుండా ఒక్కరోజు కూడా ఆంధ్రప్రదేశ్ మనుగడ సాగించలేదని, ఆ విధంగా రాష్ట్రం పరిస్థితి తయారైందని రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహారావు అన్నారు. గడ్డు పరిస్థితి నుంచి బయటపడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నించకపోవడం బాధాకరమని అన్నారు. బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడారు.
ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణపై కేంద్రం నిర్ణయం విధానపరమైనదని జీవీఎల్ నర్సింహారావు అన్నారు. విశాఖ ఉక్కు కర్మాగారం విషయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ అభివృద్ధిలోకి రావాలని, ప్లాంటు ఉద్యోగుల సంక్షేమం గురించి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని చెప్పారు. రివర్స్ టెండర్ల తరహాలోనే ఆంధ్రప్రదేశ్ రివర్స్ వృద్ధిని సాధిస్తున్నదని విమర్శించారు. కేంద్రం చేసిన అభివృద్ధిని తామే చేశామంటూ గొప్పలకు పోతున్నారని, ఇక్కడ అభివృద్ధి మొత్తం కేంద్ర నిధులతో నడుస్తున్నదని వెల్లడించారు. సినిమా టిక్కెట్లే కాకుండా ఇకపై సినిమాలను కూడా నిర్మిస్తుందేమో అని పరోక్షంగా జగన్ ప్రభుత్వం విధానాలపై జీవీఎల్ వ్యాఖ్యానించారు.
సర్జికల్ మాస్క్లతోనే కరోనా కట్టడి సాధ్యం!
అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ హత్యకు కుట్ర.. 53వేల డాలర్లకు సుపారీ
జస్టిన్ ట్రూడో విజయం చాలా కష్టమే..!
అసెంబ్లీ బరిలోకి ప్రియాంకగాంధీ వాద్రా!
ఈనెల 26 న శ్రీనగర్ దాల్ సరస్సుపై తొలి ఎయిర్షో
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..