శ్రీనగర్ : దాల్ సరస్సుపై (Air Show) తొలిసారి ఎయిర్షో నిర్వహించేందుకు సర్వం సన్నద్ధమైంది. ఈ నెల 26 న చేపట్టే ఎయిర్షోలో మిగ్ -21, సుఖోయ్ -30 విన్యాసాలు ప్రత్యేక ఆకర్శణగా నిలువనున్నాయి. ఈ ఎయిర్షోకు ‘ఫ్రీడం ఫెస్టివల్’ అని పేరు పెట్టారు. ఎయిర్ఫోర్స్లో చేరేందుకు యువతలో ఆసక్తిని పెంచాలన్న ఉద్దేశంతో ఈ ఎయిర్షో చేపడుతున్నారు.
ఒకప్పుడు ఉగ్రవాదం కారణంగా నిశ్శబ్దంగా కనిపించే శ్రీనగర్లోని ప్రసిద్ధ దాల్ సరస్సు సెప్టెంబర్ 26 న విభిన్న దృశ్యాన్ని ప్రదర్శించనున్నది. శ్రీనగర్లో మొట్టమొదటి ఎయిర్షోను నిర్వహించేందుకు కేంద్ర పాలిత ప్రాంతం సిద్ధమైంది. విమానయాన రంగం, వైమానిక దళాలపై రాష్ట్ర యువతలో ఆసక్తిని పెంపొందించే లక్ష్యంతో ఈ ప్రదర్శన నిర్వహిస్తున్నారు.
మిగ్-21 బైసన్, సుఖోయ్-30 యుద్ధ విమానాల ఫ్లైపాస్ట్తో పాటు దాల్ సరస్సు మీదుగా ఆకాశంలో సూర్య కిరణ్ విమానాల ప్రదర్శన హైలైట్గా నిలువనున్నది. ఇవేకాకుండా, పారామోటర్, పవర్డ్ హ్యాండ్-గ్లైడర్, గెలాక్సీ స్కై డైవింగ్ టీం ప్రదర్శన కూడా ప్రత్యేక ఆకర్షణలుగా ఉండనున్నాయి.
ఈ కార్యక్రమానికి కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు కశ్మీర్ డివిజనల్ కమిషనర్ పాండురంగ్ కే పోల్ చెప్పారు. ఈ కార్యక్రమానికి లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో పాటు ఎయిర్ మార్షల్ బీఆర్ కృష్ణ, వెస్ట్రన్ ఎయిర్ కమాండ్ ఏఓసీ తదితరులు పాల్గొంటారు. శ్రీనగర్, పరిసర ప్రాంతాల నుంచి 3000 మంది పాఠశాల పిల్లలకు ఎయిర్ షోకి తీసుకురానున్నారు. తొలుత 2008 లో ఇండియన్ ఎయిర్ఫోర్స్ ఈ రకం ప్రదర్శనలు నిర్వహించింది. అయితే, కశ్మీర్లో అల్లర్ల కారణంగా 2010 నుంచి నిలిచిపోయాయి.
గాంధీ జయంతి కల్లా గాడ్సే విగ్రహం ప్రతిష్ట
నీరజ్ జావెలిన్ కోచ్ ఉవే హూన్ తొలగింపు
బీఏలో ఆప్షనల్ సబ్జెక్ట్గా ‘రామ్చరిత్మానస్’.. ఎక్కడంటే?
తాజా వార్తల కోసం నమస్తే తెలంగాణ ఫేస్బుక్ , ట్విటర్, టెలిగ్రామ్ ను ఫాలో అవండి..