అమరావతి: ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు రోజురోజుకు అధికమవుతున్నాయి. రాష్ట్రంలో అధికారానికి కేంద్ర బిందువైన సెక్రటేరియట్లో కరోనా బారినపడుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. సచివాలయంలో ఇప్పటికే 60 మందికి పైగా ఉద్యోగులకు కరోనా సోకింది. వారి కుటుంబ సభ్యులకు కూడా పాజిటివ్ వచ్చినట్లు తెలుస్తున్నది. కాగా, ఆర్ధిక శాఖలో అసిస్టెంట్ సెక్రటరీగా పని చేస్తున్న ఓ ఉద్యోగి ఇప్పటికే కరోనాతో మృతి చెందారు. తాజాగా మరో ఉద్యోగి కూడా మహమ్మారి వల్ల చనిపోయారు. సాధారణ పరిపాలన శాఖలో సెక్షన్ ఆఫీసర్గా పనిచేస్తున్న జీ. రవికాంత్ ఇవాళ కరోనాతో మృతిచెందారు. రెండు రోజుల్లో ఇద్దరు సచివాలయ ఉద్యోగుల మృతి చెందడంతో సచివాలయ ఉద్యోగులు భయాందోళనలకు గురవుతున్నారు.
రాష్ట్రంలో గత 24 గంటల్లో 7,224 కరోనా కేసులు నమోదయ్యాయి. మరో 15 మంది మృతిచెందారు. దీంతో రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 9,55,455కు చేరాయి. ఇందులో 40469 కేసులు యాక్టివ్గా ఉన్నాయి. ఇప్పటి వరకు 9,07,598 మంది డిశ్చార్జీకాగా, మరో 7388 మంది మృతిచెందారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి..