AP News | సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఏపీ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ఇద్దరు సీనియర్ అధికారులపై బదిలీ వేటు వేసింది. ఇంటెలిజెన్స్ డీజీ సీతారామాంజనేయులు, విజయవాడ సీపీ క్రాంతి రాణాను బదిలీ చేసింది. వీరిని తక్షణమే విధుల నుంచి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.