Chandrababu | హైదరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ): చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన మధ్యంతర బెయిల్ పిటిషన్పై తీర్పును హైకోర్టు రిజర్వ్ చేసింది. తమ నిర్ణయాన్ని మంగళవారం వెల్లడిస్తామని న్యాయమూర్తి పేర్కొన్నారు. చంద్రబాబు తరఫున న్యాయవాది శ్రీనివాస్తోపాటు.. మరో సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా వర్చువల్గా హైకోర్టులో వాదనలు వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి కోర్టుకు హాజరయ్యారు.
చంద్రబాబుపై సీఐడీ మరో కేసు
చంద్రబాబుపై ఏపీ సీఐడీ మరో కేసు నమోదు చేసింది. మద్యం కంపెనీలకు అక్రమంగా అనుమతి ఇచ్చారన్న ఆరోపణలపై పీసీ యాక్ట్ కింద ఈ కేసు నమోదైంది. ఏసీబీ కోర్టుకు ఎఫ్ఐఆర్ కాపీ అందింది.