Pawan Kalyan | దేశ వ్యాప్తంగా దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. పలు ఆలయాల్లో అమ్మవారు వివిధ రూపాల్లో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంద్రకీలాద్రిపై (Kanaka Durga Temple) శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నేడు మూలా నక్షత్రం ( Moola Nakshatram) కావడంతో దుర్గమ్మ సరస్వతీ దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు.
ఇవాళ దుర్గమ్మను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) దర్శించుకున్నారు. కుమార్తె ఆద్య (Aadhya Konidela)తో కలిసి ఆలయం వద్దకు చేరుకున్న పవన్కు అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం తీర్థప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. పవన్తోపాటు హోంమంత్రి వంగలపూడి అనిత, ఎంపీ కేశినేని శివనాథ్, మంత్రి నిమ్మల రామానాయుడు దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇక ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రికి భక్తులు పోటెత్తుతున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా జనసంద్రంగా మారింది.
#WATCH | Andhra Pradesh Deputy CM Pawan Kalyan, along with his daughter, Aadhya Konidela visit Kanaka Durga Temple in Vijayawada on Moola Nakshatram.
On the 7th day of Navaratri, during the Moola Nakshatram, Kanaka Durga is adorned in the form of Goddess Saraswati. pic.twitter.com/wxnaqwKlUW
— ANI (@ANI) October 9, 2024
Also Read..
Garuda Seva | నయనశోభితం శ్రీవారి గరుడ సేవ.. ఏడుకొండలకు తరలివచ్చిన భక్తకోటి..
Srisailam | కాత్యాయనీ శ్రీశైల భ్రామరీ దర్శనం.. పుష్ప పల్లకీలో విహరించిన ఆదిదంపతులు