అమరావతి : శ్రీశైల క్షేత్రంలో మార్చి 1 నుంచి 11 వరకు జరుగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు (Mahashivratri Brahmotsavam) హాజరుకావాలని ఆలయ అధికారులు ఏపీ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ (Governor Abdul Nasir) కు ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ మేరకు దేవస్థానం ధర్మకర్తల మండలి అధ్యక్షులు రెడ్డివారి చక్రపాణిరెడ్డి, కార్యనిర్వహణాధికారి డి.పెద్దిరాజు, సభ్యులు గురుమహాంతు ఉమామహేశ్, అర్చకస్వాములు , వేదపండితులు గవర్నర్ను కలిసినవారిలో ఉన్నారు. ఈ సందర్భంగా గవర్నరుకు వేద ఆశీర్వవచనం అందజేసి శేషవస్త్రాలు, ప్రసాదాలు, శ్రీస్వామిఅమ్మవార్ల చిత్రపటాన్ని అందజేశారు.