అమరావతి : అవినీతి అధికారులపై ఏపీలో ఏసీబీ (ACB) అధికారులు వరుస దాడులు కొనసాగిస్తున్నారు. నిన్న ( సోమవారం) విద్యుత్ శాఖ ఏఈ, జూనియర్ అసిస్టెంట్ లంచం తీసుకుంటూ పట్టుబడగా మంగళవారం మన్యం జిల్లాలో మున్సిపల్ కమిషనర్( Municipal commissioner ) ను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు.
జిల్లాలోని సాలూర్ మున్సిపల్ పరిధిలో ఇంటి యజమాని ఒకరు భవన నిర్మాణాన్ని ప్రారంభించాడు. అయితే అందుకు కావలసిన అనుమతులతోపాటు ఇంటి పన్ను విషయంలో సాలూరు మున్సిపల్ కమిషనర్ హెచ్.శంకర్రావును సంప్రదించాడు. అయితే కమిషనర్ రూ. 4లక్షలు లంచం డిమాండ్ చేయగా సదరు ఇంటి యజమాని రెండు లక్షలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నాడు.
మంగళవారం రూ. లక్ష కమిషనర్కు ఇస్తుండగా అక్కడే మాటు వేసిన ఏసీబీ అధికారులు దాడులు చేసి కమిషనర్ను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. అతడిపై కేసు నమోదు చేశామని అధికారులు వివరించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గతంలో శంకర్రావు అవినీతి అధికారులకు పట్టుబడ్డాడు.