అమరావతి : ఏపీలో అధికార వైసీపీకి ఎన్నికల సంఘం గట్టి షాక్నిచ్చింది. పింఛన్ల పంపిణీ నుంచి వాలంటీర్ల (Volunteers) ను పక్కన పెట్టాలని ఆదేశాలు జారీ చేసింది. వాలంటీర్లతో అన్ని నగదు పంపిణీ కార్యక్రమాలు చేయించవద్దనిచీఫ్ ఎలక్షన్ కమిషన్ (Chief Election Commission) తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు. వారి వద్ద ట్యాబ్లను సెల్ఫోన్లను కోడ్ ముగిసేవరకు డిపాజిట్ చేయాలని, నగదు పంపిణీ పథకాల్లో ఉద్యోగులను వినియోగించుకోవాలని సూచించారు.
హైకోర్టు(High Court) ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా కోడ్ ముగిసే వరకు టెట్(TET) ఫలితాలు, డీఎస్సీ పరీక్షలు వాయిదా వేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేశారు. నగదు పంపిణీలో వాలంటీర్లను దూరంగా ఉంచాలని సీఎఫ్డీ సంస్థ కోర్టుకు వెళ్లగా ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిందన్నారు.