అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరిగి పోతున్నాయి.కరోనాతో కొత్తగా 9 మంది చనిపోయారు. గడిచిన 24 గంటల్లో 49, 143 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 13,618 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యింది . 8,687 మంది బాధితులు కరోనా నుంచి కోలుకున్నారు. ఇదిలా ఉండగా రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసులు లక్షకు దాటాయి . ప్రస్తుతం లక్షా 6318 యాక్టివ్ కేసులున్నాయని ఏపీ వైద్యాధికారులు వెల్లడించారు.