అమరావతి : ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 425 కరోనా కేసులు నమోదయ్యాయి. ఇద్దరు కరోనాతో మృతి చెందారని ఏపీ వైద్యాధికారులు తెలిపారు . 1,486 మంది బాధితులు కోలుకున్నారని వివరించారు. ప్రస్తుతం రాష్ట్రంలో 7,358 యాక్టివ్ కేసులు ఉన్నాయని వారు వెల్లడించారు. 19,769 మందికి కరోనా పరీక్షలు నిర్వహించామని చెప్పారు. రాష్ట్రంలో కరోనా కేసులు భారీ ఎత్తున తగ్గుతుండడంతో ప్రభుత్వం కొవిడ్ ఆంక్షలను ఎత్తివేస్తుంది.
సినిమా థియేటర్లలో 50శాతం వరకు ఉన్న ఆక్యుఫెన్సీని వంద శాతం వరకు పెంచుకోవచ్చని ఆంక్షలను సడలించింది. సచివాలయంలో పనిచేసే కిందిస్తాయి సిబ్బంది నుంచి ఉన్నతాధికారుల వరకు అందరూ విధులకు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేస్తు ఉత్తర్వులు ఇచ్చింది.