అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో ఏపీలో కొత్తగా 24,171 మంది కరోనా బారిన పడగా కొవిడ్-19తో 101 మంది మరణించారు. కాగా 21,101 మంది వ్యాధి నుంచి పూర్తిగా కోలుకుని డిశ్చార్జీ అయ్యారు. నూతన కేసులతో కలుపుకుని ఏపీలో కరోనా కేసుల సంఖ్య 14,35,491కి చేరింది. వీటిలో యాక్టివ్ కేసుల సంఖ్య 2,10,436గా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కొవిడ్-19తో ఇప్పటివరకు 9,372 మంది చనిపోయారు.
జిలాల్ల వారీగా కొవిడ్-19 మరణాల తాజా వివరాలిలా ఉన్నాయి. అనంతపురంలో అత్యధికంగా 14 మంది చనిపోగా, విశాఖపట్నంలో 11, చిత్తూరులో 10, తూర్పుగోదావరి, గుంటూరు, కృష్ణా, విజయనగరంలో 9 మంది చొప్పున, నెల్లూరులో 7, కర్నూలు, ప్రకాశం, శ్రీకాకుళంలో ఆరుగురు చొప్పున, పశ్చిమ గోదావరిలో 3, కడపలో ఇద్దరు చనిపోయారు.