తిరుమల : తిరుమల (Tirumala) లో భక్తుల రద్దీ పెరిగింది. వారాంతపు సెలవు దినం కావడంతో ఆదివారం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకుంటున్నారు. 14 కంపార్ట్మెంట్ల(compartment)లో భక్తులు వేచియున్నారు. టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు(ttd officials ) వెల్లడించారు.
నిన్న శ్రీవారిని 77,522 మంది భక్తులు దర్శించుకోగా 32,390 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 3.66 కోట్లు వచ్చిందని తెలిపారు. తిరుమలలో శ్రీవారి సాలకట్ల తెప్పోత్సవాల్లో భాగంగా రుక్మిణీకృష్ణులు తెప్పపై భక్తులకు దర్శనమిచ్చారు. రుక్మిణి సమేత శ్రీకృష్ణుల ఉత్సవమూర్తుల ఊరేగింపు మొదలైందని,ఆలయ నాలుగు మాడ వీధుల గుండా పుష్కరిణిలో తెప్పపై మూడు చుట్లు తిరిగి కనువిందు చేశారు.